Friday, 01 May 2026 03:25:07 AM

కేజీబీవీ పాఠశాలను సందర్శన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్

Date : 18 November 2025 06:54 PM Views : 279

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ// ఆనందపురం : నవంబర్ 18 సాక్ష్యం న్యూస్: ఆనందపురం మండలం లొడగలవానిపాలెం లో ఉన్న కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాన్ని శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న సమయంలో పాఠశాలకు చేరుకున్న ఆయన భోజనాన్ని స్వయంగా రుచి చూసి, పిల్లల్ని నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆఫీసు గదిని పరిశీలించిన గంటా పాఠశాల నిర్వహణ విధానాలను సమీక్షించారు. అనంతరం సుభాష్ చంద్రబోస్ నిర్మిస్తున్న కొత్త లైబ్రరీని సందర్శించి హర్షం వ్యక్తం చేశారు. ప్లే గ్రౌండ్ నిర్మాణ పనులను కూడా పరిశీలించిన ఆయన, నిర్మాణాలు పూర్తయిన పిదప ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రారంబించే కార్యక్రమం చేద్దామని వివరించారు. .

T.N.Murthy ( Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :