Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖపట్నం : జులై 10 (గురువారం) సాక్ష్యం న్యూస్: గురు పౌర్ణమి సందర్భంగా సింహాచలం గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు పెద్దఎత్తున ప్రసాద వితరణ, బిస్కట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన 'ట్రూత్ న్యూస్ టీం' భక్తుల నుంచి ప్రశంసలందుకుంది. నిరంతరం వార్తలు అందించడంతోనే సరిపుచ్చుకోకుండా..సామాజిక బాధ్యతను కూడా తనపై వేసుకున్న 'ట్రూత్ న్యూస్ ఛానల్' ఆధ్యాత్మిక, సామాజిక సేవాకార్యక్రమాలపై ఆశక్తి చూపిస్తూ.. పలువురి మన్ననలు పొందుతోంది. ఈ నేపథ్యంలో గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు పలువురి చేయూతతో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
Admin
Neti Sakshyam