Monday, 09 February 2026 05:09:34 AM

కోటి దీపోత్సవానికి ఎంపీ భరత్ కు ఆహ్వానం.

Date : 11 November 2025 09:20 PM Views : 269

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ// ఆనందపురం : నవంబరు 11 సాక్ష్యం న్యూస్: ఈ నెల 19వ తేదీన అంగరంగ వైభవంగా జరగబోతున్న శ్రీ శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి కోటి దీపోత్సవానికి విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీ భరత్‌ను ఆహ్వానించారు. విశాఖపట్నంలో ఉన్న ఆయన క్యాంపు కార్యాలయాలంలో పద్మనాభం ఎంపీటీసీ కంటుబోతు లక్ష్మి నాయుడు మరియు భీమిలి నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు కంటుబోతు సుమంత్ నాయుడు, ఎంపీ భరత్‌ను శాలువాతో సత్కరించారు అనంతరం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీని కుటుంబ సమేతంగా వేడుకలకు హాజరుకావాలని కోరారు.

T.N.Murthy ( Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :