Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / హైదరాబాదు : ఆగస్టు 19 సాక్ష్యం న్యూస్ హైద్రాబాద్: గణేశ్ విగ్రహాల తరలింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. బండ్లగూడలో ట్రాక్టర్కు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో షాక్కు గురై ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు అంబర్పేట్లో విద్యుత్ తీగలు తొలగిస్తుండగా షాక్ తో రామ్ చరణ్ అనే యువకుడు మృతిచెందాడు. యువత జాగ్రత్తలు పాటిస్తూ ఉత్సవాలను మంచి వాతావరణంలో జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
Admin
Neti Sakshyam