Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : ఆగష్టు 19 సాక్ష్యం న్యూస్: జీవో నెంబర్ 42ను రద్దు చేసి ఐ.ఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. భీమిలి SVLNS ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు,బోధనేతర సిబ్బంది నిరసనలు వ్యక్తం చేశారు. మంగళవారం మద్యాహ్నం భోజన విరామ సమయంలో సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఈ నెల 29న విజయవాడలో జరిగే ధర్నా కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేయాలని, బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా జిసిజిటిఏ అధ్యక్షులు డాక్టర్ చీడి విష్ణుమూర్తి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు స్పష్టం చేశారు.
Admin
Neti Sakshyam