Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ పద్మనాభం : జులై 18 సాక్ష్యం న్యూస్: ఎంతో కాలంగా శిధిలావస్థలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరణలో భాగంగా శంఖుస్థాపన చేసినట్లు పద్మనాభం మండల పరిషత్ అధ్యక్షుడు కె.రాంబాబు తెలిపారు. పద్మనాభం జంక్షన్ నుండి సచివాలయం వరకు జిల్లా పరిషత్ నిధులు 3 లక్షలతో సి.సి కాలువ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. పనులు ప్రారంబించి డ్రైనేజీ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో mptc లక్ష్మీ, మండల అధికారులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam