Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : జూన్ 26 సాక్ష్యం న్యూస్: మాదకద్రవ్యాలకు అలవాటు పడి యువత భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి D సౌజన్య అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమిలిలో SAY NO TO DRUGS అనే నినాదంతో చేపట్టిన అవగాహన ర్యాలీ లో అమె పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం గంజాయి, మాదకద్రవ్యా విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని అన్నారు. మాదక ద్రవ్యాలను పండించడం, రవాణా చేయడం తోపాటు వాటిని వినియోగించడం కూడా నేరమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, భీమిలి పోలీసులు పాల్గొని ప్ల కార్డులను ప్రదర్శిస్తూ ప్రజల్లో అవగాహన కలిగించారు.
Admin
Neti Sakshyam