Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : ఫిబ్రవరి 20 సాక్ష్యం షార్ట్ న్యూస్: భీమిలి నియోజకవర్గంలోని శ్రీ శ్రీ శ్రీ నవశక్తి దేవతల ఆలయముల సముదాయం పునఃప్రారంభ వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. 4వ వార్డ్ కార్పొరేటర్ దవులపల్లి కొండబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైఎస్ఆర్సిపి జిల్లా పార్టీ అధ్యక్షుడు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె సిరమ్మ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు ప్రజా ప్రతినిధులు, భక్తులు, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు మరియు సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Neti Sakshyam