Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ సింహాచలం : ఆగష్టు 19 సాక్ష్యం న్యూస్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి మంగళవారం స్వర్ణ తులసీ దళాలతో అర్చన చేశారు. గోవిందరాజస్వామి తోపాటు ఉభయ దేవేరులను ఆలయ మండపంపై అధిష్టింపజేసి స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలు నడుమ కార్యక్రమం కన్నులపండువగా జరిపించారు. అంతకుముందు స్వామి అమ్మవార్లకు సాంప్రదాయబద్ధంగా మేలుకొలుపు సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam