Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ తగరపువలస : జూలై 8 మంగళవారం సాక్ష్యం న్యూస్: తమ గ్రామం సంతోషంగా ఉండాలని...పిల్లా పాపలు చల్లంగ ఉండాలని కోరుకుంటూ.. గ్రేటర్ విశాఖ భీమిలి జోన్ చిల్లపేటలో స్థానిక మహిళలు గ్రామ దేవతలకు మ్రొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఊరేగింపుగా బయలుదేరిన మహిళలు పసుపు కుంకుమలు, చీరసారె లను గ్రామ దేవతలకు సమర్పించారు. దీంతో గ్రామంలోని ఇంటింటా ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.
Admin
Neti Sakshyam