Thursday, 05 March 2026 03:05:33 AM

గంభీరం ఏం పీ పీ పాఠశాలకు హెల్త్ అండ్ హైజిన్ ప్రాజెక్టు మేనేజర్ మాధవి

Date : 15 November 2025 06:33 PM Views : 208

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ// ఆనందపురం : ఆనందపురం. అభినవ ఆంధ్ర ఆనందపురం మండలం గంభీరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను హెల్త్ అండ్ హైజిన్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్ మాధవి సందర్శించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలో పిల్లలకు చక్కగా వివరించారు. వ్యక్తిగత ఆరోగ్యం తో పాటు సామాజిక ఆరోగ్యం చాలా ముఖ్యమని చెప్పారు. పాఠశాలలో ఉన్న విద్యార్థి వైద్య బృందం చేసిన నృత్యాలు చూసి ప్రశంసించారు. విద్యార్థులతో ఏర్పాటు చేసిన "మా పాఠశాల వైద్య బృందం" టీం ను అభినందించి, వారికి టోపీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రధాన ఉపాధ్యాయుడు యు వి వి ప్రసాద్, లలితా దేవి, శివగంగ టీచర్లు పాల్గొన్నారు.

T.N.Murthy ( Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :